2008 డీఎస్సీ బాధితులకు న్యాయం చేయండి: కాంగ్రెస్

by Disha Web Desk 2 |
2008 డీఎస్సీ బాధితులకు న్యాయం చేయండి: కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: 2008 డీఎస్సీ బాధితులకు న్యాయం చేయండి? అంటూ కాంగ్రెస్​నేత బక్క జడ్సన్​ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎస్ శాంతికుమారికి వినతిపత్రం అందజేశారు. గత 14 సంవత్సరాలుగా బీఈడీ అభ్యర్ధులు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. కోర్టులో న్యాయ పోరాటం తర్వాత తుది తీర్పు వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దీంతో 1200 కుటుంబాలను దీనస్థితిలో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం చేస్తామని గతంలో బీఆర్ఎస్​ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెంటనే పరిష్కరించాలని కోరారు.

Also Read..

200 మిలియన్ టన్నుల స్టీల్ ఉంటేనే ఫ్యాక్టరీ.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్

Next Story

Most Viewed